ఇద్దరు తెలంగాణ వాసులకు జాతీయ చేనేత పురస్కారాలు.,

On: Wednesday, July 23, 2025 6:05 AM

 

Jul 23, 2025,

తెలంగాణ : చేనేత రంగంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది 5 సంత్ కబీర్, 19 జాతీయ చేనేత అవార్డులు సహా మొత్తం 24 మందికి అవార్డులు వరించాయి. వీరిలో తెలంగాణ నుంచి గూడ పవన్, గజం నర్మద ఎంపిక అయ్యారు. వీరికి ఆగస్టు 7న న్యూఢిల్లీలో రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే వీరిద్దరి స్వస్థలం యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం(M) పుట్టపాక గ్రామం.

17 Apr 2026

Leave a Comment