తూప్రాన్, ఆగస్టు 20 (A9 న్యూస్):
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, బిజెపి మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య నివాసంలో బుధవారం ఉదయం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, బంధువులు, ప్రముఖులు హాజరయ్యారు.
పూజారి సలాక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో వ్రతాన్ని ఆచార సంప్రదాయాల ప్రకారం నిర్వహించగా, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వ్రతానంతరం ఏర్పాటుచేసిన సామూహిక భోజనంలో హాజరైనవారు ఆనందంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి తూప్రాన్ మండలంలోని రాజకీయ నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరై పోచయ్యను అభినందించారు.
ఈ సందర్భంగా పాల్గొన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్య సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు.
హాజరైన ప్రముఖులు:
పిట్ల పోచయ్య దంపతులు, కుటుంబ సభ్యులు, రవి, వెంకట్, మల్లారెడ్డి, సీనియర్ జర్నలిస్టు లయన్ డా. జానకిరామ్ సిఆర్, గడ్డం ప్రశాంత్ కుమార్, కమ్మరి శ్రీనివాస్ చారీ, ప్రజాప్రతినిధులు తదితరులు.








