తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. నేటి నుంచి మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ తేదీలను అధికారులు ప్రకటించారు. మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికల కోసం అన్ని గ్రామ పంచాయతీల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.








