నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి  TPCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం…..

On: Friday, September 19, 2025 7:13 PM

 

హైదరాబాద్, సెప్టెంబర్ 19:

నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి  ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ గౌడ్  మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల ప్రధాన సమస్యలు మరియు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృత చర్చ జరిగింది. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలనే అంశంపై విశేషంగా చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీ మహేష్ గౌడ్  మాట్లాడుతూ:

> “పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలి. ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలి,” అని సూచించారు.

అలాగే, నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

21 Jun 2026

Leave a Comment