శోభాయాత్ర ఏర్పాట్లు: బాలాపూర్ గణేశుడి దర్శనంతో ప్రారంభమై, చార్మినార్, మొజంజాహి మార్కెట్, తెలుగు తల్లి వంతెన మార్గంలో హుస్సేన్సాగర్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది.
బందోబస్తు: శాంతియుత నిమజ్జనం కోసం 30 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు – సీపీ సీవీ ఆనంద్.
క్షేత్రస్థాయి పరిశీలన: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ హరిచందన, పోలీస్ కమిషనర్లు మార్గాన్ని పరిశీలించారు.
విగ్రహాల నిమజ్జనం: సెప్టెంబరు 2వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్లో 1,21,905 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది.
అత్యధికంగా కూకట్పల్లిలో – 41,000+
అత్యల్పంగా చార్మినార్లో – 6,254.
వాహనాల ఏర్పాటు: నిమజ్జన వాహనాల కోసం RTA 1500కుపైగా అభ్యర్థనలు అందుకుంది. అద్దె ధరలు ₹1,000 – ₹33,000 మధ్య ఉన్నాయి.
అమిత్ షా హాజరు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిమజ్జనోత్సవానికి హాజరుకానున్నారు – గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి డా. రావినూతల శశిధర్ వెల్లడి.







