పిచ్చికుక్కల కలకలం: మాసాయిపేటలో 16 మందిపై దాడి – బాధితులను పరామర్శించిన ఆవుల రాజిరెడ్డి…

On: Tuesday, August 26, 2025 7:09 PM

ఎ9 న్యూస్, మాసాయిపేట, ఆగస్టు 26:

మాసాయిపేట గ్రామంలోసోమవారం రాత్రి 8 గం. జరిగిన పిచ్చికుక్కల దాడి గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. 16 మంది గ్రామస్తులు ఈ దాడిలో గాయపడగా, వారిని తక్షణమే మెరుగైన చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఈ నేపథ్యంలో, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులను కోరుతూ, “బాధితులకు సమయానికి మెరుగైన వైద్యసేవలు అందించాలనీ, అవసరమైన మెడికల్ సదుపాయాలను కల్పించాలనీ” సూచించారు.

గ్రామస్థులు ఈ ఘటనపై ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థపై నమ్మకం ఉంచుతూ స్పందించారు. స్థానిక అధికారుల పర్యవేక్షణలో కుక్కలను పట్టుకునే చర్యలు ప్రారంభించబడ్డాయి.

13 Jan 2026

Leave a Comment