జక్రాన్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షం కారణంగా ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు వెల్లడించారు, ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇన్ని నెలల నిరీక్షణ ఫలితంగా చేతికి వచ్చిన పంట వర్షం వల్ల తడిసిందని ధాన్యానికి మొలకలు వచ్చే అవకాశం ఉందని గిట్టుబాటు ధర కూడా రాకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.








