తెలంగాణ ఎంపీలపై హరీష్ రావు విమర్శలు…..

On: Tuesday, November 18, 2025 12:09 PM

 

తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 16 మంది ఎంపీలు స్పందించకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలకైనా పంటను కాపాడే లక్ష్యం ఉంటుందని, కానీ రాష్ట్ర సమస్యలపై ఈ ఎంపీలు ఒక్క మాట మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, ఆత్మహత్యలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడితే కేసీఆర్ లేదా బీఆర్ఎస్‌ను విమర్శించడమే తప్ప రైతుల సమస్యలను ప్రస్తావించరని, అదే విధంగా బీజేపీ ఎంపీలు కూడా కేంద్రాన్ని అడగడానికి వెనుకాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

పత్తి రైతులకు మద్దతు ధర, కొనుగోలు సమస్యలు వంటి కీలక అంశాలపై కేంద్రం స్పందించేలా ఎంపీలు ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

17 Apr 2026

Leave a Comment