బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు…. 

On: Friday, October 10, 2025 11:23 AM

 

తుపాకి రాముడు చెప్పినట్లుగా చెప్పావు ముఖ్యమంత్రి.

బీఎస్పీ మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్.

ఎ9 న్యూస్ ,చేగుంట,అక్టోబర్ 9:

ఆరు గ్యారెంటీల లాగానే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతుందని మెదక్ జిల్లా, తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండల అధ్యక్షుడు బిఎస్పి పార్టీ టప్ప భాను చందర్ ఆరోపించారు అనంతరం 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా అని ప్రశ్నించారు.చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో డిల్లీ వేదికగా ధర్నాలకు పిలుపునివ్వాలని అన్నారు మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటా పంచలయ్యాయి.  22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు.తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదు. అని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంతు రెడ్డి తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారు.

బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటు కునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసారు.రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడండి. పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చేలా ప్రయత్నం చేయండి.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయండి అని ఈ సందర్బంగా చేగుంట మండలం బీఎస్పీ అధ్యక్షుడు భానుచందర్ డిమాండ్ చేశారు.

08 Nov 2025

Leave a Comment