ఎ9 న్యూస్, మాసాయిపేట,మెదక్, డిసెంబర్ 11:
మెదక్ జిల్లా, మాసాయిపేట మండల కేంద్రంలోని మాసాయిపేట గ్రామా పట్టణం కు చెందిన బొందిలి లక్ష్మణ్ గౌడ్ తండ్రి నర్సాగౌడ్ వయసు (55). వృత్తి కల్లు వ్యాపారము గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. హాస్పిటల్లో చూపించుకున్నప్పటికీ అతను ఆరోగ్యము మెరుగైతలేదని చెప్పి మనస్థాపము చెంది ఈరోజు రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇట్టి విషయంలో మృతిని చిన్న కొడుకు దుర్గాప్రసాద్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని చేగుంట పోలీసులు దర్యాప్తు చేపట్టారు అని తెలిపారు.








