Nov 25, 2025,
తెలంగాణ : రాష్ట్రంలో 0-5 ఏళ్లలోపు చిన్నారుల కోసం రేవంత్ సర్కార్ ‘బాల భరోసా’ పథకాన్ని తీసుకురానుంది. అంగన్వాడీ, ఆశా వర్కర్లు పిల్లల చూపు, వినికిడి, ప్రవర్తన వంటి 42 అంశాలపై ఇంటింటి సర్వే చేశారు. 18 లక్షల మంది డేటా సేకరించగా 8 లక్షల మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యలున్న పిల్లలకు ఉచిత చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక త్వరలోనే సీఎం రేవంత్ ఈ స్కీమ్ను ప్రారంభిస్తారని సమచారం.








