*సేవింగ్స్ ఖాతాల్లో రూ.10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం.
*అన్ని బ్యాంకు ఖాతాల్లో కలిపి ఈ పరిమితి వర్తింపు.
*ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10 లక్షలు దాటినా పైకి నివేదిక.
*మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో రూ.10 లక్షల పెట్టుబడులపైనా దృష్టి.
*సాధారణంగా బ్యాంకు SB ఖాతాల్లో డబ్బు జమ చేయడం, విత్డ్రా చేయడం సహజం అయితే, ఒక సంవత్సరంలో మీ అన్ని సేవింగ్స్ ఖాతాల్లో కలిపి జమ చేసిన మొత్తం రూ.10 లక్షలు దాటితే, ఆ సమాచారాన్ని బ్యాంకులు నేరుగా ఆదాయ పన్ను విభాగానికి తెలియజేస్తాయి.
*ఒకే ఖాతాలో కాకుండా వేర్వేరు ఖాతాల్లో జమ చేసినా, మీ పాన్ కార్డు ఆధారంగా అన్నింటినీ కలిపి లెక్కిస్తారు.
*నోటీసులు ఎప్పుడు వస్తాయి?.
*ఈ లావాదేవీల వివరాలు ఐటీ శాఖ వద్దకు చేరినప్పుడు, మీ ఐటీ రిటర్నుల్లో చూపిన ఆదాయంతో పోల్చి చూస్తారు. రెండింటి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే, వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
*కాబట్టి, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు వాటికి సంబంధించిన సరైన ఆధారాలు, పత్రాలు ఉంచుకోవడం చాలా ముఖ్యం.








