హైదరాబాద్: కూకట్‌పల్లి ఆర్టీసీ డివిజన్‌ పరిధి లింగంపల్లి నుంచి ఎన్‌జీవో కాలనీ వరకు గ్రీన్‌ ఎలక్ట్రిక్‌ మెట్రో బస్సులు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ ఆర్‌ఎం కవితరూపుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి 216/300 నెంబరుతో ఆపరేట్‌ అవుతాయని ఆమె తెలిపారు. లింగంపల్లి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి కొత్తగా పుష్పక్‌ బస్సులు అందుబాటులోకి తెచ్చినట్టు ఆమె వివరించారు.

 

ఈ బస్సులు లింగంపల్లి నుంచి ఆల్విన్‌క్రాస్‌ రోడ్డు, హఫీజ్‌పేట్‌ మీదుగా గచ్చిబౌలీ మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటాయని తెలియజేశారు. లింగంపల్లి నుంచి విమానాశ్రయానికి రూ. 300 చార్జి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. లింగంపల్లి నుంచి మొదటి బస్సు ఉదయం 5.45కు, ఆఖరి బస్సు 8.45కు ఉంటుందని ఆమె తెలియజేశారు.. *KP*

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *