A9 న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి:
ప్రజాపాలన కార్యక్రమములో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కొరకు దరఖాస్తు చేసుకున్న వారు, మీ ఇంటివద్దకు ఇందిరమ్మ ఇళ్లు సర్వే చేయుటకు గాను సర్వేయర్ మీ ఇంటివద్దకు వచ్చినపుడు ఈ క్రింద తెలిపిన వాటిని తప్పక తమ దగ్గర ఉంచుకొని సర్వే కు సహకరించవలసినదిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో కోరడం జరిగింది.
1) రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు)
2) ఆధార్ కార్డు
3) కరెంటు బిల్లు
4) ఇంటిపన్ను రసీదు
5) పట్టా పాస్ బుక్కు
6) భూమి యాజమాన్య పత్రం/ పోజిషన్ సర్టిఫికెట్
ఇళ్ళు ఇంటి యజమానురాలి పేరు మీద మంజూరు చేయబడుతుంది, వారి ఫోటో తీసుకోబడుతుంది. కావున ఇంటి యజమానురాలు తప్పక ఉండాలి.
ఇళ్ళు నిర్మాణం 400 స్క్వేర్ ఫీట్ కి తక్కువ కాకుండా నిర్మించాలని, దీనికి గాను ప్రభుత్వం 5 లక్షల రూపాయలు లబ్ధిదారురాలి బ్యాంకు ఖాతాలో విడతల వారీగా జమచేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేసారు.