*ఇకపై నాన్-ఏసీ కోచ్ ల్లోనూ దుప్పటి, దిండు.
రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది.
2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.
ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది.
ఈ సౌకర్యాన్ని రైల్వే శాఖ చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.






