బాజిరెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం. A9న్యూస్ ఇందల్వాయి మండల మార్చ్ 14..

తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు బీఆర్ఎస్ అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయించడం పట్ల, ఇందల్వాయి మండల బీఆర్ఎస్ నాయకులు వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం మండల పార్టీ అధ్యక్షుడు చిలువరి దాస్ ఆధ్వర్యంలో, స్థానిక అంబేద్కర్ చౌరస్తా లో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. బాజిరెడ్డి ఎంపీగా ప్రజల ఆదరణతో అత్యధిక మెజార్టీతో గెలుపొందు తరని వారు ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రజల ఆదర అభిమానాలు కావాలని ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకే ఇప్పుడు తెలుసని ఎంపీపీ రమేష్ నాయక్ అన్నారు సీనియర్ నాయకులు పాశంకుమార్ మాట్లాడుతూ బాజిరెడ్డి ఎంపీగా ప్రజలు ఆదరణ అభిమానాలు పొందుతారని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ గోవర్ధన్ ఎంపీటీసీ దాస్ షేక్ హుస్సేన్ గిరీష్ నామాల గంగారాం సిర్నాపల్లి శ్రీనివాస్ సాయిలు శ్రీనివాస్ టిఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *