కామారెడ్డి A9 న్యూస్, జనవరి 31:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి.సంతోష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ముందున్న సిఐగా ఉన్న ఎస్ రామన్ నీ ఐజి కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని తెలియజేశారు. సదాశివ నగర్ సిఐగా సంతోష్ కుమార్ బాధితులు స్వీకరించి అనంతరం మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడతానన్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించే వారి సమాచారం పోలీసులకు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *