పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2,500.. బడ్జెట్‌లో ప్రకటన….

On: Monday, March 16, 2026 6:14 AM

 

Mar 15, 2026:

తెలంగాణ : సీఎం రేవంత్ మరో రెండు ఎన్నికల హామీల అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. మహిళలకు రూ 2,500, పెన్షన్లు రూ.4వేలు, ఆరు వేలకు పెంపు పైన ప్రకటనకు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు రేపు (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఈసారి బడ్జెట్‌లో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.

01 May 2026

Leave a Comment