ఎ9 న్యూస్, మాసాయిపేట ,డిసెంబర్ 17:
మాసాయిపేట పంచాయతీ ఎన్నికల సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి తమ స్వగ్రామమైన మాసాయిపేట గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును విని యోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ప్రతి ఓటరు తన హక్కును బాధ్యతగా వినియో గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల చైతన్యంతోనే ప్రజాస్వామ్యం మరింత బలపడు తుందని ఆయన పేర్కొన్నారు.








