భీమ్ గల్ పట్టణంలోని అభినవ శబరిమల సోక్కయ్య గుట్ట ఫై గల అయ్యప్ప స్వామి దేవాలయంలోసుబ్బారావు గురు స్వామి ఆధ్వర్యంలో సుమారు యాభై మంది అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామీ మాలాధారన చేసి మండల దీక్షను ప్రారంభించారు.

కొత్తగా మాల ధరించే కన్నె స్వాములకు ఆలయ కమిటీ వారునూతన వస్త్రాలు అందించారు 

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం

ఈ సందర్భంగాసుబ్బారావు గురుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భీమ్ గల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భక్తులు అధిక సంఖ్యలో అయ్యప్ప మాల ధారణ వేసుకుని మండల దీక్షను చేపడతారని, అయ్యప్ప స్వామి దీక్ష పద్ధతులు కచ్చితంగా పాటించి స్వామి ని శరణు వేడుకుంటే మనకున్న సమస్యలన్నింటిని స్వామి తీరుస్తాడని అన్నారు. అయ్యప్పస్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *