A9 న్యూస్ ప్రతినిధి డిచ్పల్లి:
డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 10 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని 108 వాహనాల ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు.