A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

భారతీయ జనతా గిరిజన మోర్చా (బి జె జి ఎం) నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గా కొర్ర గంగాధర్ కేజీ ని నియమిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మరియు ఆర్మూర్ అసెంబ్లీ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా నియామాక పత్రాన్ని ఆర్మూర్ లోని పార్లమెంటు కార్యాలయము నందు ఇచ్చి అభినందనలు తెలియజేయడమైనది.

ఈ సందర్భంగా కొర్ర గంగాధర్ మాట్లాడుతూ…తనపై నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నిస్వార్ధంగా నిర్వహించి నిజాయితీతో పార్టీ అభివృద్ధికై కృషి చేస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్ ని మరోసారి ఎంపీగా గెలిచే విధంగా కృషి చేస్తానని తెలియజేయడమైనది.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, పట్టణ ఉపాధ్యక్షులు దుగ్గి విజయ్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్ మరియు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *