తెలంగాణ, సెప్టెంబర్ 1:
ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్లు వాడటాన్ని నిషేధిస్తూ నిబంధనలు రూపొందించింది.
ఈ నిబంధనలు పైలట్ ప్రాజెక్ట్ రూపంలో నేటి నుంచి అమలులోకి వచ్చాయి. మొదటి విడతలో 11 డిపోలలో ఈ నిషేధం ప్రయోగాత్మకంగా అమలవుతోంది.
🔸 గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని
ఫరూక్నగర్ డిపో, కూకట్పల్లి డిపో ఈ జాబితాలో ఉన్నాయి.
ఆర్టీసీ ఈ చర్యతో డ్రైవర్ల దృష్టి మరలకుండా, ప్రయాణికుల ప్రాణభద్రతను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.







