16 గేట్లు ఎత్తివేసిన అధికారులు.
నిజామాబాద్ జిల్లా:ఆగస్టు 23:
నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగు తుంది. శనివారం ప్రాజెక్టులో 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 80,000 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 78,812 క్యూసెక్కులుగా ఉంది. 16 గేట్ల ద్వారా 49,280 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,500 క్యూసెక్కు లు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు, ప్రస్తుతం 1,090.8 అడుగుల వద్ద ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 79.65 టీఎంసీలు నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ అధికారులు వరద ప్రవాహాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తూ, ఆగమాన నివారణ చర్యలను జాగ్రత్త గా కొనసాగిస్తున్నారని తెలిపారు.
కొట్టుకుపోయిన మూల స్థానం కాజ్ వే కొనసాగు తున్న భారీ వర్షాలు, వరద నీరు అధికమవడంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాజ్వే, కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం వద్ద శుక్ర వారం ఉదయం ఒక్కసారి గా ధ్వంసమయ్యింది. 21 తూరలతో నిర్మించిన ఈ కొత్త కాజ్వే పూర్తిగా వరద నీటికి కొట్టుకుపోయి అన్ని తూరలుధ్వంసమయ్యాయి.
ఈ కాజ్వే కిందుగా రావుల పాలెం మండలం ఊబు లంక గ్రామ పంచాయతీకి చెందిన తోకలంక జల దిగ్బంధం ఉంది, దీంతో వందలాది ఎకరాల పంట భూములు ముంపుకు గురయ్యాయి. తోకలంకతో పాటు జొన్నాడ, మూలస్థానం, చొప్పెల్ల లంకలకు చెందిన పంటలు కూడా ధ్వంసం అయ్యాయి. క్రమంలో కొత్తపేట ఆర్డిఓ శ్రీకర్ కాజ్వే వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
జలదిగ్బంధంలోని ప్రజలు రాకపోకలు కొనసాగించేం దుకు నాలుగు పడవలు ఏర్పాటు చేశారు. Rao, ఎంపీడీవో, రూరల్ సీఐ మరియు స్థానిక అధికారు లతో ఆర్డిఓ చర్చించి, ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి తగిన చర్యలు చేపట్టారు. అలాగే, దారి పొడచనా ప్రాంతాల్లో వరద ప్రమాద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఊబులంక పంచాయతీ అధికారులు, విఆర్వోలు స్థానంలో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారు లు కు నివేదిస్తున్నారు.







