ఆర్మూర్ A9 న్యూస్, ప్రతినిధి ఫిబ్రవరి 28:

ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు భారత్చంద్ర మల్లయ్య, సెక్రెటరీ విద్య ప్రవీణ్ పవార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఇట్టి సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో, ప్రైవేట్ పాఠశాలలు చురుకుగా పాల్గొని తమవంతు సహకారం అందించాలని, పేదవారికి సాధ్యమయినంత సహాయం అందివ్వాలని, విద్యావంతులు ఆర్మూర్ అభివృద్ధికి పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి స్కాలర్స్ వేణు, కాంతి గంగారెడ్డి, మానస గణేష్, విద్య గోపీకృష్ణ, నలంద సాగర్, పోల్కం శ్రీనివాస్, లిల్లీపుట్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *