ఆటోను ఢీ కొన్న ఎమ్మెల్యే కాన్వాయ్…

  1. సదాశివ్ బచ్చగొని A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం

– తృటిలో తప్పిన ప్రమాదం….

 రుద్రూర్ .మoడలంలోని లింగంపల్లి శివారులో సోమవారం బోధన్ ఎమ్మెల్యే కాన్వాయ్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోటగిరి మండలంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కాన్వాయ్ తో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో పల్టి కొట్టింది. కారు స్పీడ్ లో ఢీ కొట్టడంతో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ప్రమాదం గురించి రుద్రూర్ ఎస్సై మహేందర్ ను వివరణ కోరగా ప్రమాదం ఘటన వాస్తవమేనని, డ్రైవర్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించింది వాస్తవమేనని అన్నారు. కానీ ఎలాంటి పిర్యాదులు రాలేదని తాము బందోబస్తు విధుల్లో ఉన్నానని ఎస్సై తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *