A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆలూర్ మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో విద్యార్థులు ఘనంగా ఎంఈఓ నరేందర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన తమ గురువుగారు ఎంఈఓగా ఉండటం తమ అదృష్టమని విద్యార్థులు భావించారు. ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలసి ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నరేందర్ కేక్ కట్ చేసి విద్యార్థులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థులు స్వయంగా సిద్ధం చేసిన చిన్న కానుకను గురువుగారికి అందజేయగా, ఆయన హర్షం వ్యక్తం చేశారు. వేడుకల్లో ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు.







