నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు…..

On: Monday, August 18, 2025 1:21 PM

 

A9 న్యూస్ ,మెదక్, ఆగస్టు 18:

వర్షాల వల్ల జిల్లా లో వాగులు ఉదృతంగా ప్రవహిస్తునందున ఏ ఆపద వచ్చిన లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్-100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 57888కు సమాచారం అందించగలరు

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల ఏ ప్రమాదం సంభవించిన వెంటనే పోలీస్ వారికీ సమాచారం అందించాలని, ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో పోలీస్ అధికారులను, సిబ్బందిని సిద్ధం చెయ్యడం జరిగిందనీ జిల్లా ఎస్పీ తెలిపారు. వర్షాల వల్ల ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని, రహదారుల పై గాని , ఇతర ప్రదేశాల లో ఏ సమస్యా తలెత్తిన వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.

మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు, పశువులు కాపరులు అటువైపు గానీ , వాగులు, వంకలు వైపు వెళ్లవద్దని, గ్రామాలలో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకునేందుకు గస్తీ పోలీసులను అప్రమత్తంగా ఉండేలా ఆదేశించినట్లు ఎస్పీ గారు తెలిపారు. నిరంత రాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్- 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ నెంబర్ కు (+91 87126 57888) సమాచారం అందించినచొ తక్షణ సహాయక రక్షణ చర్యలు పోలీస్ అధికారులు చేపడతారని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి.

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించగలరు.

1) వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు, వాటికి కరెంట్ షాక్ వచ్చి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.

2) ఇనుప వైర్ లపై గృహిణి లు బట్టలు ఆరవేయరాదు కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది.

3) ఇంటి పై కప్పుగా వేసిన ఇనుప రేకులను తాకరాదు.

4) శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ,మట్టీ గోడలు తో ఉన్న ఇళ్ళలో, ఉదృతంగా ప్రవహించే నాలల దగ్గర ఉండే నివాసలలో ఉండకండి,అవి ఊహించని విధంగా కూలిపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.

5) రైతులు మీ వ్యవసాయ బావుల వద్ద ,బోర్ ల వద్ద కరెంట్ పెట్టె ముందు తడిసిన స్టార్టర్ బాక్స్ లను,ఫ్యుజ్ బాక్స్ లను చేతులతో ముట్టుకోరాదు.

6) వరద నీటికి చెరువులు,కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తం గా ఉండగలరు.

7) చిన్నపిల్లలు మరియు ఈత రానివారు ఎట్టిపరిస్థితుల్లో కూడా చెరువు లోకి ఈత కు గాని లేదా చేపల వేటకు గాని వెళ్ళరాదు. తల్లిదండ్రులు పిల్లలను బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

8) వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు

కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి , అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది.

కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.

9) వరదల వలన డ్రైనేజి కాలువల మ్యాన్ హోల్స్ వాటికవే తెరువబడి ఉంటాయి కావున జాగ్రత్త గా ప్రయాణించగలరు.

10) వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నపుడు

వాహనాలతో దాటడానికి సాహసం చేయకండి.

11.అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి.

07 Mar 2026

Leave a Comment