మేడారం మాస్టర్ ప్లాన్కు ₹25 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి.
ఢిల్లీ:
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను మంత్రి షేకావత్కు వివరించారు. ముఖ్యంగా మేడారం జాతర కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులకు కేంద్రం నుండి రూ.25 కోట్ల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు.
అదే విధంగా, మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి అదనంగా రూ.25 కోట్లు కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి షేకావత్ సానుకూలంగా స్పందించగా, సీతక్క ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.