నిజామాబాద్ A9 న్యూస్:

సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పిట్ల ఎల్లన్న భారత దేశంలో దోపిడి పీడన లేని రాజ్యం కోసం పని చేస్తూ ఉన్న క్రమంలో పీపుల్స్ వార్ 32 సంవత్సరాల క్రితం అకారణంగా కాల్చి చంపారు వర్గ దృక్పథాన్ని విస్మరించి కామ్రేడ్ ఎల్లన్న చంపి న్యూ డెమోక్రసీని దెబ్బతీశామని భ్రమపడ్డారు కానీ వాళ్లే కనుమరుగయ్యారు నేడు భారతదేశంలో మోడీ ఫాసిస్టు విధానాలతో అనేక సమస్యలను ఎదుర్కొంటుందని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి ఖాజా మోహినుద్దీన్ అన్నారు. భీంగల్ పట్టణంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఈనెల 16న జరిగే ఎల్లన్న స్మారక సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వి బాలయ్య, పిట్ల మార్క్స్, ప్రిన్స్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *