డొంకేశ్వర్,సెప్టెంబర్ 17,నూత్ పల్లి గ్రామం:
దేశ ప్రధానమంత్రి, విశ్వవిఖ్యాత జననేత నరేంద్ర మోడీ గారి 75వ పుట్టిన రోజు సందర్భంగా నూత్ పల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి నూత్ పల్లి శాఖ ఆధ్వర్యంలో గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేయడం జరిగింది. అదనంగా, గ్రామస్థులకు పండ్ల పంపిణీ కూడా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని మోడీ గారి ఆరోగ్య సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.







