A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా పట్టణంలో శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణం కోసం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే యజమానులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ తమ తమ డీజేలు వినిపించకూడదని స్వచ్ఛందంగా అంగీకరించి, ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పోలీసులకు అందజేశారు.
తాము ఇచ్చిన హామీని ఉల్లంఘించి డీజేలు వినిపించినట్లయితే, క్రిమినల్ చర్యలకు లోనవుతామని కూడా స్పష్టంగా లిఖితపూర్వకంగా పేర్కొన్నారు.







