కరీంనగర్ జిల్లా మార్చి02

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి కృష్ణ, గుంటూరు, జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అయితే ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన రేపు తుది పలితాలను వెల్లడిస్తామని ఏపీ ఎన్నికల కమిషన్ తెలిపింది,

 

దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ, కరీం నగర్‌- మెదక్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కిం పును చేపట్టనున్నారు. నల్లగొండలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది కౌంటింగ్‌ ప్రారంభ మైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండా లని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నల్లగొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు.

 

బ్యాలెట్‌ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్‌ తీయడం, సంబంధించిన ఫారాలలో సంతకాలు తీసుకోవాలని చెప్పారు. అలాగే కరీంనగర్‌- మెదక్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయు ల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచిన కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ స్టేడియంలోనే ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి రెండు, మూడురోజులు సమయం పట్టే అవకాశ మున్నందున మూడు షిఫ్టు ల్లో లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలను, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఎన్నికల రిటర్నింగ్‌ అధికా రి, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి శనివారం బ్యాలెట్‌ బాక్సుల భద్రత ను, కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు హో రాహోరీగా తలపడడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *