హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా రూ.7,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, సాధారణ ప్రభుత్వ వ్యయాల నిర్వహణ కోసం ఈ రుణాన్ని తీసుకున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ రుణాల ద్వారా నిధులు సమీకరించే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ నిర్వహించిన వేలం (ఆక్షన్) ద్వారా తెలంగాణ ఈ నిధులను సమీకరించింది. ఈ మేరకు రుణ సేకరణ ప్రక్రియ పూర్తయింది.
రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో భాగంగా అవసరాలను బట్టి తెలంగాణ ప్రభుత్వం కాలానుగుణంగా మార్కెట్ రుణాలను సమీకరిస్తూ వస్తోంది.








