*దళిత ప్రజా ప్రతినిధి దప్పు స్వామి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు.
ఎ9 న్యూస్, మాసాయిపేట ,మెదక్, జూలై 10:
మెదక్ జిల్లా, తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం కేంద్రంలో దళితవాడ కాలనీలో ఎస్సీ మాదిగ కుటుంబానికి చెందిన దపు స్వామి తల్లి మరణించిన విషయం తెలిసిందే, ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు విషయం తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఎలా జరిగింది. అని సంఘటన వివరాలు కుమారుడు దపు స్వామి తో ,తల్లి మృతి చెందడం బాధాకర విషయం అని ధైర్యం చెప్పి ఓదార్చి ఆర్థిక సహాయం అందజేసినట్లు మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు తెలిపారు. ఆయనతోపాటు దళిత ప్రజా ప్రతినిధులు ఎర్ర దశరథ, దప్పు మహేష్ , గుడ్డి రమేష్, ఎర్ర స్వామి, గుడి శంకర్, ఎర్ర పెద్ద పోశయ్య తదితరులు పాల్గొన్నారు.