హైదరాబాద్, జూలై 17: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు.
ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులు స్థానిక వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.








