Apr 09, 2026:
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) గుడ్ న్యూస్ చెప్పింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సహజ మరణం పొందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10లక్షల ఉచిత బీమా సొమ్ము ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది APR 1 నుంచే అమలులోకి వచ్చిందని, దీనికి ఉద్యోగులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలోని రూ.కోటి ప్రమాద బీమా యథాతథంగా ఉంటుందని తెలిపింది.








