Mar 24, 2026:
రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS) ప్రారంభం కానున్నాయి. నర్సరీ నుండి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్రూమ్లు, ల్యాబ్లు, లైబ్రరీ, క్రీడా ప్రాంగణాలు, ఉచిత బస్సు సౌకర్యాలతో విద్య అందిస్తాయి. ప్రతి స్కూల్లో సుమారు 1,500 మంది విద్యార్థులు చేరవచ్చు. సెమీ-రెసిడెన్షియల్ విధానం, ప్రతి తరగతికి టీచర్ కేటాయింపు, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం వంటి ప్రత్యేకతలు ఉంటాయి. 2026-27 నుంచి గజ్వెల్లో మొదటి TPS ప్రారంభం కానుంది.








