Jan 19, 2026,
తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి మేడారం సందర్శించి, తిరుపతి, కుంభమేళా తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. జంపన్నవాగులో నిత్యం నీళ్లుండేలా రామప్ప నుంచి ప్రత్యేక పైప్లైన్ వేస్తామని, కోట్లాది మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మూడేళ్ల కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించడం కొత్త చరిత్ర అని పేర్కొన్నారు. తాను మరణించినా మేడారాన్ని అభివృద్ధి చేశాననే సంతృప్తి మిగులుతుందని భావోద్వేగంగా మాట్లాడారు.








