A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపాలిటీ పాత బస్టాండ్ హుస్నాబాద్ గల్లిలోని పద్మశాలి సంఘం 3వ తర్ప ఆధ్వర్యంలో ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ను మంగళవారం ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మూడో తర్ప అధ్యక్షులు చిట్ల యాగ్నేశ్, కార్యదర్శి మేకల మోహన్, ఉపాధ్యక్షులు గురుడు రామచందర్, క్యాషియర్ అంబటి శ్రీనివాస్, నూకల శేఖర్, గురుడు శ్రీనివాస్, పెంబర్తి గణేష్, బడుగు శ్రీనివాస్, దోమల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.