A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:
పెర్కిట్ గ్రామంలో అక్రమ పేకాటపై పోలీసులు దాడి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు.ఈ సంఘటన శనివారం ఉదయం 4:00 గంటల సమయంలో చోటుచేసుకుంది.
పెర్కిట్ గ్రామ పరిధిలోని కల్లుబట్టి బయట ప్రాంతంలో మూడుముక్కల పేకాట ఆడుతున్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో పెర్కిట్ గ్రామానికి చెందిన మేతరి నవీన్, నాగరాజు, హన్వాతే రాములు, అలాగే కేశపురం నవీన్ అనే నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.
వారి వద్ద నుంచి రూ.8,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.








