బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్ములించాలి….

On: Friday, July 11, 2025 5:51 AM

*ఆపరేషన్ ముస్కాన్ లో పది రోజుల వ్యవధిలో 41 మంది పిల్లలను రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది. 

*జిల్లా వ్యాప్తంగా 8 కేసుల నమోదు

*అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు.

జిల్లా ఎస్పీ. . డి. వి. శ్రీనివాస రావు.

ఎ9 న్యూస్, మెదక్ ,జులై 11:

రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుండి ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన సందర్భంగా పది రోజుల వ్యవధిలో మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ దిగ్విజయంగా కొనసాగుతుందని, అన్ని శాఖల సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దామని జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం నాడు పోలీసు ముఖ్య కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వివిధ శాఖల సమన్వయంతో సమావేశంలో జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ముఖ్యంగా హోటల్లు నందు, ఇటుక బట్టీల నందు, నిర్మాణ పనుల నందు, వ్యాపార సముదాయాల నందు పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారి ని తల్లిదండ్రులకు గాని సంరక్షణ గృహాలకు కానీ చేర్చి యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, కార్మికులుగా కర్షకులుగా కొనసాగరాదని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 41 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు మరియు సంరక్షణ స్థలాలకు చేర్చడం జరిగిందని. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 కేసులను నమోదు చేసినట్లు, బాల కార్మికులను పనిలో ఉంచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు,నిర్వహించనున్నట్లు అన్ని శాఖల సమిష్టి కృషితో కొనసాగాలని ప్రతిరోజు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలను గ్రామాలను సందర్శిస్తూ బాల కార్మికులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ . ఎస్. మహేందర్ మరియు DCRB ఇన్స్పెక్టర్ . మధు సుధన్ గౌడ్ మరియు సీడీపీఓ కరుణ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉప్పలయ్య మరియు హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు మరియు లేబర్ డిపార్ట్మెంట్ మరియు NGO సభ్యులు మరియు రెండు డివిజన్ లకు చెందిన ఆపరేషన్ ముస్కాన్ టీం లు పాల్గొన్నారు.

22 Jul 2025

Leave a Comment