జక్రాన్పల్లి, ఆగస్టు 28:
జక్రాన్ పల్లి మండలంలోని
పుప్పాలపల్లి గ్రామంలోని గంగాధర్ కుంట చెరువు అలుగు పారడంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఎండాకాలంలో ఎడారిలా మారిన కుంట ఈ వర్షాలతో నిండిపోవడంతో చెరువు కట్టపైకి చేరుకున్న ప్రజలు ఉత్సాహంగా సందర్శించారు. నీటి అలలు కట్టమీదుగా పారిపోతూ అందమైన దృశ్యాన్ని సృష్టించగా, చిన్నా పెద్దా అందరూ కుంట దృశ్యాన్ని ఆస్వాదించారు. ఎన్నేళ్ల తర్వాత చెరువు అలుగు పారడం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది.







