జక్రాన్ పల్లి మండల అన్ని గ్రామాల ప్రజలకు పోలీసులు తగు జాగ్రత్తలు సూచించారు,
ఎస్సై మహేష్ మాట్లాడుతూ సెలవులు పండగల సమయంలో దొంగతనాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఊరికి వెళ్ళేవారు ఇళ్లకు తాలాలు సరిగ్గా వేసి విలువైన వస్తువులను బ్యాంకు,లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు,సీసీ కెమెరాలు,అలారాలు ఏర్పాటు చేసుకోవాలని వాహనాలకు చైన్ లాక్ వేయడం అవసరమని తెలిపారు,సోషల్ మీడియా లో ప్రయాణ వివరాలు పోస్ట్ చేయవద్దని,అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.








