Jul 09, 2025,
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనుంబంధంతో తెలంగాణకు తీరని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి నష్టం జరగకుండా ఇద్దరి మధ్యే అనుబంధం పెంచుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. “బేసిన్లు లేవు.. భేషజాల్లేవు.. గోదావరిలో 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి” అని గతంలో కేసీఆర్ అన్నారని సీఎం గుర్తు చేశారు. జగన్కు సూచనలతో పాటు టెండర్లు, జీవోలు ఇచ్చేలా KCR సహకరించారని మండిపడ్డారు.