A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో సుపోషిత్ గ్రామ పంచాయితీ అభియాన్ కార్యక్రమం భాగంగా నిజమాబాద్ జిల్లా కేంద్ర బృందం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించింది. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యత, పిల్లల బరువు తదితర వివరాలను పరిశీలించి నామోదు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి విగ్నేష్, కారోబార్ గంగాధర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. గ్రామస్థులలో పోషకాహారంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.