A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బైపిసి ఇంటర్ సెకండియర్ చదువుతున్న సంతోష్ (17) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది
పాఠశాల సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.
ఈ ఘటన పాఠశాల విద్యార్థులు, సిబ్బందిలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.