Nov 04, 2025,
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుఫాన్ కారణంగా వరదల్లో పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.15 వేలు, గుడిసెలు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే, ఎకరా పంట నష్టానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.






