Jul 13,2025,
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాలో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్కు చెందిన గోరంట్ల సురేష్ బాబుపై శనివారం పీడీ యాక్ట్ అమలు చేశారు. చింతలమానెపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, జూలై 3న అరెస్ట్ చేసి, కౌటాల సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో చర్లపల్లి జైలుకు తరలించారు. నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ హెచ్చరించారు.