Jul 30,2025,
తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిధులయ్యాయి. నిధులను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద ఒకటి నుండి ఎనిమిదో తరగతి విద్యార్థులకు వంట ఖర్చులు, వంట సహాయకుల గౌరవ వేతనం కోసం నిధుల మొత్తాన్ని విడుదల చేశారు. విడుదల చేసిన మొత్తం నిధులు రూ. 51,78,88,960. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ వరకు ఒక్కో జిల్లాకు రూ.1000 చొప్పున మంజూరు చేసింది.